Hyderabad: రూ.4 కోట్ల క‌ట్నం చాల‌లేదు..!

Hyderabad: హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. వ‌ర‌కట్న వేధింపులు త‌ట్టుకోలేక ఓ మ‌హిళ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. గాజులరామారంకి చెందిన అభిలాష్, అమరావతి దంపతులకు 2019లో వివాహం జ‌రిగింది. ఆ స‌మ‌యంలో అమ‌రావ‌తి త‌ల్లిదండ్రులు అభిలాష్‌కు రూ.4 కోట్లు కట్నం ఇచ్చి పెళ్లి చేసారు. అది వారికి సరిపోలేదు. రోజూ ఏదో ఒక మాట అంటూ వేధింపుల‌కు గురిచేసారు. అత్తింటి వేధింపులు తట్టుకోలేని అమరావతి సూసైడ్ లెటర్ రాసి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.