Vijay Antony: రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో పేద‌ల‌కు ట్రీట్ ఇచ్చిన హీరో

Rajamahendravaram: ప్ర‌ముఖ న‌టుడు విజ‌య్ ఆంటోనీ (vijay antony)..ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో (rajamahendravram) పేద‌ల‌కు ట్రీట్ ఇచ్చారు. ఆయ‌న న‌టించిన బిచ‌గాడు-2 సినిమా హిట్ అయిన సంద‌ర్భంగా పేద‌ల క‌డుపు నింపాలని అనుకున్నార‌ట‌. ఈ సినిమాలో ఆయ‌న నిరుపేద యువ‌కుడి పాత్ర‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. పేద‌వారి ఆక‌లి విలువ తెలిసిన విజ‌య్ ఆంటోనీ ఇలా త‌న మంచి మ‌న‌సును చాటుకున్నాడు. రాజ‌మ‌హేంద్ర‌వ‌రానికి చెందిన కొంద‌రు పేద‌వారిని ఓ మంచి రెస్టారెంట్‌కి తీసుకెళ్లి వారికి క‌డుపు నిండా భోజ‌నం పెట్టించాడు. వారిని ఆయ‌నే స్వ‌యంగా వండిపెట్టారు కూడా.