పాస్‌పోర్ట్‌లు సిద్ధం.. ఎన్నిక‌ల త‌ర్వాత జంప్?

YS Avinash Reddy and family are leaving india after ap elections

YS Avinash Reddy: ఎన్నిక‌ల త‌ర్వాత వైఎస్ అవినాష్ రెడ్డి విదేశాల‌కు పారిపోనున్నారా? ఏపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిళ ఈరోజు ప్రెస్ మీట్‌లో ఈ విష‌యంపై షాకింగ్ వ్యాఖ్య‌లు చేసారు. ఎన్నిక‌ల్లో ఎక్కడ ఓడిపోతే వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్య కేసులో అరెస్ట్ చేస్తారో అని అవినాష్ రెడ్డి త‌న కుటుంబీకులు పాస్‌పోర్ట్‌లు సిద్ధం చేసుకున్నార‌ని.. ఫ‌లితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ ఓడిపోతోంది అని తెలీగానే విదేశాల‌కు వెళ్లిపోయేందుకు అన్నీ ప్లాన్ చేసుకున్నార‌ని ష‌ర్మిళ అన్నారు. విదేశాల‌కు వెళ్లిపోతే అప్పుడు ఏ కేసు విష‌యంలోనూ త‌మ‌ను వెన‌క్కి ర‌ప్పించలేర‌ని.. ఒక‌వేళ ర‌ప్పించేందుకు ప్ర‌య‌త్నించినా దానిని చాలా స‌మ‌యం ప‌డుతుంద‌ని ఈ ప్లాన్ వేసార‌ట‌.