పిఠాపురంలో హై టెన్షన్ .. కోటి రూపాయల మద్యం సీజ్

Pithapuram: జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న పిఠాపురంలో హై టెన్ష‌న్ నెలకొంది. నిన్న రాత్రి కోటి రూపాయ‌లు విలువ చేసే గోవా లిక్క‌ర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి వ‌చ్చిన లిక్క‌ర్ కల్తీద‌ని పోలీసులు తెలిపారు. ఈ నేప‌థ్యంలో పిఠాపురం వైఎస్సార్ కాంగ్రెస్ అభ్య‌ర్ధి వంగా గీత‌ను అరెస్ట్ చేయాల‌ని తెలుగు దేశం పార్టీ నేత ఎస్వీఎస్ఎన్ వ‌ర్మ డిమాండ్ చేసారు. లేదంటే నేత‌లతో క‌లిసి ఆందోళ‌న‌కు దిగుతామ‌ని హెచ్చ‌రించారు.