Janasena: రుషికొండ పాకిస్థాన్‌లో ఉందా?

AP: వైజాగ్‌లోని రుషికొండ (rushikonda) వెళ్లే అన్ని ప్రాంతాల‌ను ఏపీ పోలీసులు నిర్భందించారు. రుషికొండ‌లో జ‌రుగుతున్న‌ నిర్మాణాలను పరిశీలించేందుకు జనసేనాని (janasena) పవన్ కళ్యాణ్ (pawan kalyan) వెళ్తున్నారు అని తెలిసి పోలీసులు అన్ని మార్గాలను దిగ్బంధనం చేశారని జ‌న‌సేన ఆరోపించింది. సామాన్య ప్రజలను సైతం కనీసం వెళ్ళనివ్వలేదని మండిప‌డింది. రుషికొండ పర్యాటక ప్రాంతమైనప్పటికీ నిషిద్ధ ప్రాంతంగా, ప‌క్క దేశానికి బోర్డ‌ర్ దాటి వెళ్లిన‌ట్లు మార్చేసార‌ని జ‌న‌సేన ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. రుషికొండ ప్రాంతం పూర్తి నిషిద్ధ ప్రాంతంలో ఉందా..? లేక పాకిస్థాన్లో ఉందా? అన్నట్లుగా పోలీసులు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, ప్రజాస్వామ్య దేశంలో ఉన్నట్లుగా అనిపించడంలేద‌ని ఆరోపించింది.