అమెరికాలో తెలుగు యువ‌కుడు మిస్సింగ్

telugu student missing in usa

USA: అమెరికాలో భారతీయ విద్యార్ధులు అదృశ్యం అవ‌డం.. అనుమానాస్ప‌ద స్థితిలో మృతిచెంద‌డం.. హ‌త్య‌కు గుర‌వ‌డం రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. తాజా ఘ‌ట‌న‌లో హ‌న్మ‌కొండ‌కు చెందిన రూపేష్ చంద్ర చింత‌కింది అనే యువ‌కుడు అదృశ్యం అయ్యాడు. దాంతో అత‌నికి ఏమ‌య్యిందో అని హ‌న్మ‌కొండ‌లోని కుటుంబీకులు గుండెల‌విసేలా ఏడుస్తున్నారు. వ‌రంగ‌ల్‌లోని ఎస్ఆర్ ఇంజినీరింగ్ క‌ళాశాల‌లో సివిల్ ఇంజినీరింగ్ చేసిన రూపేష్ చంద్ర విస్క‌న్సిన్‌లోని కాంకార్డియా యూనివ‌ర్సిటీకి పై చ‌దువులు చ‌దివేందుకు వెళ్లాడు. గ‌త నాలుగు రోజులుగా రూపేష్ చంద్ర క‌నిపించ‌డం లేద‌ని అత‌ని తోటి స్నేహితులు స్థానిక పోలీసులకు స‌మాచారం ఇచ్చారు. దాంతో రూపేష్ కోసం విస్క‌న్సిన్ పోలీసులు గాలింపులు చేప‌డుతున్నారు.