YS Sharmila: మోదీకి అస‌లు సిగ్గుందా?

YS Sharmila slams modi about polavaram project

YS Sharmila: APCC చీఫ్ వైఎస్ ష‌ర్మిళ కూట‌మిపై.. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీపై మండిప‌డ్డారు. నిన్న కేంద్ర మంత్రి అమిత్ షా ప్ర‌చారంలో భాగంగా ఎన్నిక‌ల్లో కూట‌మి అధికారంలోకి వ‌స్తే పోల‌వ‌రం ప్రాజెక్ట్‌ను రెండేళ్ల‌లో పూర్తి చేసి తీర‌తాం అని హామీ ఇచ్చారు. దీనిపై ష‌ర్మిళ స్పందించారు. “” అస‌లు భార‌తీయ జ‌న‌తా పార్టీకి సిగ్గుందా? ఇన్నేళ్లు అధికారంలో ఉండి పోల‌వ‌రం పూర్తి చేయ‌కుండా.. రేపు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయ‌ని రెండేళ్ల‌లో పోల‌వ‌రం పూర్తి చేస్తామ‌ని ఓట్లు అడుక్కుంటున్నారు. ఇన్నేళ్లు అధికారంలో ఉన్న‌ది మీరే క‌దా? మిమ్మ‌ల్ని ఎవ‌రైనా బెదిరించారా పోల‌వ‌రం ప్రాజెక్ట్ పూర్తి చేయొద్దు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు స్పెష‌ల్ స్టేట‌స్ ఇవ్వ‌ద్దు అని? అంత చిత్త శుద్ధి ఉంటే ఎప్పుడో పోల‌వ‌రం పూర్తి చేసుండాలి క‌దా? “” అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు.