Revanth Reddy: రేవంత్ రెడ్డికి మహబూబ్ నగర్ భయం!

Revanth Reddy:  తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి మహ‌బూబ్ న‌గర్ భ‌యం ప‌ట్టుకున్న‌ట్లుంది. ఇప్ప‌టివ‌ర‌కు ఆరు సార్లు మహ‌బూబ్ న‌గ‌ర్ వెళ్లి వ‌చ్చిన ఆయ‌న ఈరోజు మ‌ళ్లీ వెళ్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మహబూబ్ నగర్‌పై స్పెషల్ ఫోక‌స్ చేసారు. కొండగల్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి సీఎం హాజ‌రుకానున్నారు.

మహబూబ్‌నగర్ నుంచి వంశీ చందర్‌రెడ్డి నామినేష‌న్ వేసారు. నామినేష‌న్‌కి ముందు త‌ర్వాత కూడా రేవంత్ మహబూబ్ నగర్ చుట్టూనే చక్కర్లు కొడుతున్నారు. సొంత నియోజకర్గమైన మహబూబ్ నగర్ నిలబెట్టుకోవాలనే తపత్రయమో లేక ఓటమి భయమో తెలీదు కానీ గత 50 రోజుల్లో ఒక్క మహబూబ్‌నగర్‌ పార్లమెంట్ పరిధిలోనే ఆరు సార్లు పర్యటించారు.

ALSO READ:

Telangana Congress: ఎంపీ ఎన్నిక‌ల్లో ఓడిపోతే ఉచిత బ‌స్సు ప‌థ‌కం నిలిపివేత‌

Revanth Reddy: సీఎం ప‌ద‌వికి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి మాత్ర‌మే అర్హుడు