Janasena: మే నుంచి పిఠాపురంలో చిరంజీవి ప్ర‌చారం

Janasena: ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) పిఠాపురం నుంచి బ‌రిలోకి దిగ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇందుకోసం ప‌వ‌న్ పిఠాపురంలో (Pithapuram) ఓ ఇల్లు కూడా తీసుకున్నారు. అయితే.. ప‌వ‌న్ కోసం చిరంజీవి పిఠాపురంలో ప్ర‌చారంలో పాల్గొంటార‌ని తెలుస్తోంది. మే మొద‌టి వారం నుంచి చిరు ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో, ర్యాలీల్లో పాల్గొంటార‌ని స‌మాచారం. అయితే.. కూట‌మిలో భాగం అయిన తెలుగు దేశం, భార‌తీయ జ‌న‌తా పార్టీల‌కు మాత్రం చిరు ఎలాంటి ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డంలేదు. జ‌న‌సేన పార్టీ కోసం ఇటీవ‌ల చిరు రూ.5 కోట్లు విరాళం కూడా ఇచ్చారు. ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో చిరు పాల్గొంటే క‌చ్చితంగా కూట‌మికి మేలు జ‌రుగుతుంద‌ని నేత‌లు భావిస్తున్నారు.

ALSO READ:

Pawan Kalyan: ర‌హ‌స్యంగా ఆ ఇద్ద‌రినీ క‌లుస్తున్నారా?

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి నాలుగు, ఐదో పెళ్లాలు రెడీగా ఉన్నారు