Kerala: కొన్ని గంట‌ల్లో ఫ్లైట్.. గ‌న్నేరు పువ్వు తిని య‌వ‌తి మృతి

woman dies after eating oleander flower

Kerala: కేర‌ళ‌కు చెందిన ఓ యువ‌తి గ‌న్నేరు పువ్వు తిన‌డంతో మృత్యువాత‌ప‌డింది.  26 ఏళ్ల సూర్య సురేంద్ర‌న్ అనే యువ‌తి న‌ర్స్‌గా ప‌నిచేస్తోంది. ఉద్యోగ రిత్యా ఆమె నిన్న యూకే వెళ్లాల్సి ఉంది. ఈ నేప‌థ్యంలో ఎయిర్‌పోర్ట్‌కి బ‌య‌లుదేరే ముందు త‌న ప‌క్కింటి వాళ్ల‌కు ఒక మాట చెప్పి వెళ్లాలి అనుకుంది. వారి ఇంటికి వెళ్లి మాట్లాడి వ‌స్తుండ‌గా.. వారి ఇంట్లో ఉన్న గ‌న్నేరు పువ్వును తెంపి తెలీక న‌మిలేసింది. ఆ త‌ర్వాత ఎయిర్‌పోర్ట్‌కు బ‌య‌లుదేరింది. ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న కొన్ని నిమిషాల్లోనే ఆమె స్పృహ‌త‌ప్పి ప‌డిపోయింది. ముందు అంతా గుండెపోటుతో చ‌నిపోయింద‌ని అనుకున్నారు. ఆ త‌ర్వాత వైద్యులు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. గ‌న్నేరు పువ్వు తిన‌డంతో అది క‌డుపులో విషంగా మారి చ‌నిపోయింద‌ని తెలిపారు.