Mulugu: గుండెపోటుతో 12 ఏళ్ల బాలుడి మృతి

12 ఏళ్ల వ‌య‌సులోనే ఓ బాలుడు గుండెపోటుతో మృతిచెందిన ఘ‌ట‌న ములుగు (mulugu) జిల్లాలో చోటుచేసుకుంది. వాజేడు మండల కేంద్రానికి చెందిన సూత్రపు హరిచందర్ అనే బాలుడుకి ఇంట్లో ఉండగా గుండెపోటు వచ్చింది. ఈ క్రమంలో హాస్పిట‌ల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. చిన్న వయసులో గుండెపోటుతో మృతి చెందడంతో గ్రామస్థులు కంటతడి పెట్టారు.

ఘజియాబాద్‌లో జిమ్ చేస్తూ..

మ‌రోప‌క్క ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని ఘ‌జియాబాద్‌లో 19 ఏళ్ల యువ‌కుడు ట్రెడ్‌మిల్‌పై ప‌రిగెడుతూ కుప్ప‌కూలిపోయాడు. అత‌న్ని హాస్పిటల్‌కి త‌ర‌లించ‌గా గుండెపోటుతో చ‌నిపోయిన‌ట్లు వైద్యులు తెలిపారు.