కొన్ని గంట‌ల్లో పెళ్లి.. రోడ్డు ప్ర‌మాదంలో వ‌ధువు దుర్మ‌రణం

Viral News: కొన్ని గంట‌ల్లో పెళ్లి జ‌ర‌గాల్సి ఉండ‌గా.. వ‌ధువు రోడ్డు ప్ర‌మాదంలో దుర్మ‌ర‌ణం చెందిన ఘ‌ట‌న ఫ‌రీదాబాద్‌లో చోటుచేసుకుంది. వ‌ధువు అంకిత త‌న సోద‌రుడు, స్నేహితుల‌తో క‌లిసి పెళ్లి మండపానికి వెళ్తుండ‌గా ఈ దుర్ఘ‌ట‌న చోటుచేసుకుంది. వీరంతా క‌లిసి పెళ్లి మండ‌పానికి కారులో వెళ్తుండ‌గా ఓ ట్ర‌క్కు వీరి కారును ఢీకొంది. ప్ర‌మాదంలో అంకిత అక్క‌డికక్క‌డే మృతిచెంద‌గా.. మిగ‌తా ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. పెళ్లి చేసుకుని సంతోషంగా అత్తారింటికి వెళ్లాల్సిన ఆడ‌పిల్ల ఇలా విగ‌త‌జీవిగా ఇంటికి వ‌స్తుంద‌ని క‌ల‌లో కూడా ఊహించ‌లేదంటూ అంకిత త‌ల్లిదండ్రులు రోద‌న‌లు మిన్నంటాయి.