Narendra Modi: 2019లో నీచుడు.. 2024లో నీతిమంతుడు

what narendra spoke about chandrababu naidu in 2019 and 2024

Narendra Modi: ఈరోజు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ రాజ‌మండ్రిలో తెలుగు దేశం పార్టీ, జ‌న‌సేన అధినేత‌లో క‌లిసి ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు నాయుడు పాల‌న‌ను ఆకాశానికెత్తేస్తూ న‌రేంద్ర మోదీ వ్యాఖ్య‌లు చేయ‌డం హాస్యాస్ప‌దంగా మారింది. ఎందుకంటే 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబు నాయుడు ఎన్డీయే కూట‌మికి గుడ్ బై చెప్పి ఒంట‌రిగా పోటీకి దిగిన‌ప్పుడు మోదీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు వ‌చ్చి స‌భ‌లో పాల్గొన్నారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న చంద్రబాబు గురించి చేసిన వ్యాఖ్య‌లను.. ఈరోజు చేసిన వ్యాఖ్య‌ల‌ను పోలుస్తూ నెటిజ‌న్లు కామెంట్స్ పెడుతున్నారు.

2019లో అలా…

అమరావతి నిర్మాణానికి సాయం చేయకుండా మట్టి, నీరు ముఖాన కొట్టి ఇప్పుడు మాట్లాడటానికి సిగ్గుగా లేదా ?

ఏపీ జీవ‌నాడి పోలవరం ప్రాజెక్ట్‌ను చంద్రబాబు ATMగా మార్చాడు

చంద్ర‌బాబు సీఎంగా ఉండ‌డం ఏపీ దుర‌దృష్టం.. ఏపీ ప్ర‌జ‌ల ఉనికిని, గౌర‌వాన్ని తాక‌ట్టు పెట్టి, కాంగ్రెస్‌తో జ‌త క‌ట్టారు.

2024లో ఇలా..

రాజధానికి కేంద్రం రూ.15వేల కోట్లు ఇవ్వాలని భావించింది. కేంద్ర నిధులను వైసీపీ సర్కారు అందుకోలేకపోయింది

ఏపీ జీవ‌నాడి పోల‌వ‌రంను వైసీపీ అపేసింది

చంద్ర‌బాబు హ‌యంలో ఏపీ అభివృద్ధిలో నెం. 1 గా ఉండేది.. జ‌గ‌న్ ఐదేళ్ల హ‌యంలో పాల‌న ప‌ట్టాలు త‌ప్పింది.