Pothina Mahesh: జ‌న‌సేన గెల‌వ‌డం క‌ష్టం.. పార్టీకి భ‌విష్య‌త్తు ఉండ‌దు

Pothina Mahesh: వ‌చ్చే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ గెల‌వ‌డం క‌ష్ట‌మని అన్నారు మ‌హేష్ పోతిన‌. జ‌న‌సేన నుంచి విజ‌య‌వాడ వెస్ట్ సీటును ఆశించిన మ‌హేష్‌కు నిరాశే మిగిలింది. ఈ సీటును కూట‌మిలో భాగం అయిన భార‌తీయ జ‌న‌తా పార్టీకి (Bharatiya Janata Party) కేటాయించ‌డంతో మ‌హేష్ అలిగారు. దాంతో వెంట‌నే పార్టీకి, స‌భ్య‌త్వానికి రాజీనామా చేసారు.

అస‌లు జ‌న‌సేన పార్టీ సీట్లు తెలుగు దేశం పార్టీకి (Telugu Desam Party) ఎందుకు వెళ్తున్నాయ‌ని ప్ర‌శ్నించారు. ఇదే జ‌రిగితే ఎన్నిక‌ల త‌ర్వాత జ‌న‌సేన గెలిచినా కూడా పెద్ద తేడా ఉండ‌ద‌ని.. తెలుగు దేశం, భార‌తీయ జ‌న‌తా పార్టీలే ఏలుతుంటాయ‌ని జ‌న‌సేన క‌నుమ‌రుగైపోతుంద‌ని హెచ్చ‌రించారు. 20 ఏళ్ల పాటు పార్టీ ఉండాల‌ని పవ‌న్ క‌ళ్యాణ్ అన్నారని అది జ‌రిగే ప‌నిలా అనిపించ‌డం లేద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.