Pawan Kalyan: అర్థం చేసుకోండి.. ఏపీ న‌ష్ట‌పోతుంది

Pawan Kalyan: జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిన్న తిరుప‌తికి చెందిన జనసేన నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశం అయ్యారు. తిరుప‌తి టికెట్‌ను ఆర‌ణి శ్రీనివాసులుకి ఇవ్వ‌డంపై అక్క‌డి నేత‌లు భ‌గ్గుమ‌న్నారు. ఆరణికి టికెట్ ఇస్తే తాము మ‌ద్ద‌తు తెల‌ప‌బోం అని తెగేసి చెప్పేసారు. దాంతో ప‌వ‌న్ వారితో స్వ‌యంగా మాట్లాడి స‌ర్దిచెప్పారు.

జ‌న‌సేన నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌తో ప‌వ‌న్ చెప్పిన మాట‌లు

“” మనం ఎందుకు తెలుగు దేశం, భార‌తీయ జ‌న‌తా పార్టీల‌తో పొత్తు పెట్టుకున్నాం. ఒక్క‌డినే ఏపీ రాష్ట్రాన్ని కాపాడ‌టానికి ఎంతో త‌గ్గాను. ఎన్నో మెట్లు దిగొచ్చాను. పొత్తు పెట్టుకున్న‌ది మ‌న పార్టీని త‌క్కువ చేసుకునేందుకు కాదు. నేను ఒక్క‌డినే ఈ రాష్ట్రాన్ని కాపాడ‌లేను. నాకు తోడు కావాలి. మీరున్నార‌న్న ధైర్యంతోనే నేను పొత్తు పెట్టుకున్నాను. అలాంటి మీరే ఇలా కొట్టుకుంటే ఎలా? తిరుప‌త‌నే కాదు మ‌నం ఏ అభ్య‌ర్ధిని మార్చినా కూడా ఏపీ న‌ష్ట‌పోతుంది. ద‌య‌చేసి అర్థం చేసుకోండి “” అని చెప్పిన‌ట్లు తెలుస్తోంది.

ALSO READ: అందుకే జ‌గ‌న్ ష‌ర్మిళ‌కు ఆస్తి ఇవ్వ‌లేదు