Pawan Kalyan: నా నాలుగో పెళ్లాంని అవ‌మానించార‌ట‌!

Pawan Kalyan: నా నాలుగో పెళ్లాంని ఎగ‌తాళి చేసారు అంటూ జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై (Jagan Mohan Reddy) సెటైర్లు వేసారు. నిన్న కాకినాడ‌లో మేం సిద్ధం స‌భ‌లో జ‌గ‌న్ ప్ర‌సంగిస్తుండ‌గా.. స్థానిక గండేప‌ల్లి మండ‌లంలో ఆదిత్య యూనివ‌ర్సిటీ ఉంది. అదే యూనివ‌ర్సిటీ మీదుగా జ‌గ‌న్ బ‌స్సు యాత్ర సాగింది. ఈ నేప‌థ్యంలో విద్యార్ధులు బాబులకే బాబు క‌ళ్యాణ్ బాబు అని అరిచారు. అది విని జ‌గ‌న్ షాక‌య్యారు.

దీనిపై ఈరోజు కాకినాడ‌లో వారాహి యాత్ర చేప‌ట్టిన ప‌వ‌న్ మాట్లాడుతూ.. “” నిన్న ఎవ‌రో నా నాలుగో భార్య‌కు అవ‌మానం జరిగింద‌ని నాకు ఎవ‌రో చెప్పారు. నాకు అర్థంకాలేదు. నేను మ‌ర్చిపోయాను. కాబ‌ట్టి జ‌గ‌న్.. నువ్వు నా వ్య‌క్తిగ‌త జీవితం గురించి మాట్లాడిన‌ప్పుడు నువ్వు నా నాలుగో పెళ్లాం అని అంద‌రూ మాట్లాడ‌తారు గుర్తుపెట్టుకో “” అని వార్నింగ్ ఇచ్చారు.

Pithapuram: పెరుగుతున్న ప‌వ‌న్ గ్రాఫ్‌.. గీత‌కు షాక్‌

ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి అన్ని వార్త‌లు చ‌ద‌వ‌డానికి క్లిక్ చేయండి