YS Sharmila: నాన్న పేరును సీబీఐ చార్జ్‌షీట్‌లో రాయించింది జ‌గ‌న్ లాయ‌రే

YS Sharmila: APCC చీఫ్ వైఎస్ ష‌ర్మిళ.. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై (Jagan Mohan Reddy) షాకింగ్ కామెంట్స్ చేసారు.  వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పేరును సీబీఐ చార్జ్ షీట్‌లో రాయించిన కాంగ్రెస్ పార్టీతో చేతులు క‌లిపిన ష‌ర్మిళ వైఎస్సార్ వార‌సురాలు ఎలా అవుతుంది అని నిన్న పులివెందుల‌లో జ‌గ‌న్ నిప్పులు చెరిగారు. దీనిపై ఈరోజు ష‌ర్మిళ మాట్లాడుతూ.. సీబీఐ చార్జ్‌షీట్‌లో పేరు రాయించింది జ‌గ‌న్ లాయ‌రే అని.. ఆ త‌ర్వాత అతనికి జ‌గన్ మ‌రో ప‌ద‌వి ఇచ్చి మ‌రీ త‌న వ‌ద్దే పెట్టుకున్నార‌న్న విష‌యం జ‌గన్ మ‌ర్చిపోయిన‌ట్లు ఉన్నాడ‌ని షాకింగ్ వ్యాఖ్య‌లు చేసారు. ఈ విష‌యం తెలిసి కూడా జ‌గ‌న్ అలా ఎందుకు చేసావు అని అడ‌గ‌లేద‌ని.. పైగా తండ్రిని కేసులో ఇరికించాలని అనుకున్న‌వారినే తెచ్చి ప‌క్కన పెట్టుకున్న‌వాడు రాజ‌శేఖ‌ర్ రెడ్డి వార‌సుడు ఎలా అవుతాడ‌ని మండిప‌డ్డారు.