Chandrababu: దేవుడు స్క్రిప్ట్ మార్చాడు.. ఓడించ‌లేరు!

రానున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో TDP త‌ప్ప‌కుండా గెలుస్తుంద‌ని.. ఈసారి దేవుడు స్క్రిప్ట్ మార్చి రాసాడు కాబ‌ట్టి TDP గెలుపును ఆపే శక్తి ఎవ‌రికీ లేద‌ని అన్నారు చంద్ర‌బాబు నాయుడు (chandrababu naidu). కాకినాడ‌లో నిర్వ‌హించిన జోన్ 2 కార్య‌క్ర‌మంలో భాగంగా చంద్ర‌బాబు మాట్లాడారు. రాష్ట్రంలో పొలిటిక‌ల్ వాతావ‌రణం చూస్తుంటే విజయం TDPదే అని క్లియ‌ర్‌గా అర్థ‌మ‌వుతోంద‌ని అన్నారు. అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగిన ప్ర‌తీ సారి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (jagan mohan reddy) ఓడిపోతూనే ఉన్నాడ‌ని ఈసారి కూడా అంతేనని ధీమా వ్య‌క్తం చేసారు.

TDP చేప‌ట్టిన బాదుడు, ఇదేం ఖ‌ర్మ మ‌న రాష్ట్రానికి కార్య‌క్ర‌మాల‌కు మంచి ఫ‌లితాలు వ‌చ్చాయ‌ని తెలిపారు. ఇప్ప‌టికే మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో గ్రాడ్యుయేట్ ఎన్నిక‌ల్లో గెలిచామ‌ని ఇటీవ‌ల పంచాయ‌తీ ఉప ఎన్నిక‌ల్లో కూడా గెలుపు త‌మ‌దేన‌ని అన్నారు. గ‌త 30 ఏళ్ల‌లో TDP గెల‌వ‌లేని చోట్ల కూడా మొన్న జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో TDP గెలిచి చూపించింద‌ని తెలిపారు. దీనిని బ‌ట్టి చూస్తే TDP విజ‌యం మొద‌లైపోయింద‌ని తెలుస్తోంద‌ని పేర్కొన్నారు. (chandrababu naidu)

ఇప్పుడు ఏ ఎన్నిక‌లు పెట్టినా TDPనే గెలుస్తుంద‌న్న ధీమాతో ఉన్నారు. ఏపీలో ఉన్న ఏ వ‌ర్గానికి చెందిన ప్ర‌జ‌లు కూడా ప్ర‌స్తుత ప్ర‌భుత్వంతో సంతోషంగా లేర‌ని, ఏపీని YSRCP నాశ‌నం చేసింద‌ని ఆరోపించారు. అన్ని నిత్య‌వ‌స‌ర ధ‌ర‌లు పెరిగిపోతున్నాయ‌ని, ఇదేంటి అని అడిగితే కేసులు పెట్టే ప్ర‌భుత్వాన్ని తాను ఎక్క‌డా చూడ‌లేద‌ని విమ‌ర్శించారు. ప్ర‌శాంతంగా ఉండే కోన‌సీమ‌లో అల్ల‌ర్లు మొద‌లుపెట్టార‌ని ఓ ద‌ళితుడిని దారుణంగా చంపి అత‌ని శవాన్ని డోర్ డెలివ‌రీ చేసార‌ని మండిప‌డ్డారు.

గ‌తంలో TDP ప్ర‌వేశ‌పెట్టిన అన్ని ప‌థ‌కాలు విజ‌య‌వంతం అయ్యాయ‌ని ఇప్పుడు కూడా అధికారంలోకి వ‌స్తే త‌ప్ప‌కుండా చెప్పిన‌వ‌న్నీ చేస్తామ‌ని హామీ ఇచ్చారు. జ‌గ‌న్‌కు కేవ‌లం ఏపీని నాశ‌నం చేయ‌డం అస‌లు ఏ రాజ‌ధానీ లేకుండా చేయ‌డం త‌ప్ప ఏమీ తెలీద‌ని తిట్టారు. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న స‌మ‌యంలో TDPపై అర్థంలేని ఆరోప‌ణ‌లు చేయ‌డం YSRCPకి అల‌వాటేన‌ని ఇప్పుడు కూడా అదే చేస్తున్నార‌ని ఎద్దేవాచేసారు. ఇప్పుడు జ‌గ‌న్ వ్య‌తిరేక ఓట్ల‌ను డిలీట్ చేసే ప‌నిలో ఉన్నార‌ని ఈ విష‌యంలో ప్ర‌జ‌లు, టీడీపీ కార్య‌క‌ర్త‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని పిలుపునిచ్చారు. (chandrababu naidu)