Ashok Gajapathi Raju: ఆనాడు NDA నుంచి బ‌య‌ట‌ప‌డి మంచి పని చేసాం

 

Ashok Gajapathi Raju interesting comments about chandrababu naidu teaming up with nda again

Ashok Gajapathi Raju: 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో తెలుగు దేశం పార్టీ (TDP) NDA కూట‌మి నుంచి బ‌య‌టికొచ్చి మంచి ప‌ని చేసింద‌ని అన్నారు మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి రాజు. కొంత‌కాలంగా అనారోగ్య స‌మస్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న ఆయ‌న ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం లేదు. కానీ పార్టీకి ఎప్పుడు కావ‌లాన్నా కూడా త‌న అభిప్రాయాలు, స‌ల‌హాలు ఇస్తూ ఉన్నారు. ఈసారి ఎన్నిక‌ల్లో తెలుగు దేశం పార్టీ మ‌ళ్లీ NDA కూట‌మితో పొత్తు పెట్టుకోవ‌డంపై అశోక్ గ‌జ‌ప‌తి రాజు స్పందించారు.

“” ఆనాడు తెలుగు దేశం పార్టీ కూట‌మి నుంచి బ‌య‌టికొచ్చి మంచి పని చేసింది. ఈనాడు మ‌ళ్లీ పొత్తు పెట్టుకోవ‌డం కూడా క‌రెక్టే. ఈసారి భార‌తీయ జ‌న‌తా పార్టీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి క‌చ్చితంగా మేలు చేస్తాం అని అంటోంది. అది న‌మ్మి తెలుగు దేశం పార్టీ మ‌ళ్లీ NDAతో చేతులు క‌లిపింది. 2019 ఎన్నిక‌ల్ స‌మ‌యంలో ఏపీ రీఆర్గ‌నైజేష‌న్ చ‌ట్టంలో చేసిన మార్పుల వ‌ల్ల తెలుగు దేశం పార్టీ కూట‌మి నుంచి బ‌య‌టికి రావాల్సి వ‌చ్చింది. ఆ త‌ర్వాత ఏపీ రీఆర్గ‌నైజేష‌న్ యాక్ట్‌లో భాగంగా ఎన్డీయే ప్ర‌భుత్వం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి నిధులు కేటాయించినా ఇప్పుడున్న ప్ర‌భుత్వం ఎలాంటి ప‌నులు చేయ‌కుండా విఫ‌ల‌మైంది“” అని తెలిపారు.