Ambati Rambabu: కల‌ చెదిరింది.. క‌థ మారింది

Ambati Rambabu: వైఎస్ ష‌ర్మిళ (ys sharmila) కాంగ్రెస్‌లో చేర‌డంపై స్పందించారు YSRCP మంత్రి అంబ‌టి రాంబాబు. అమరుడైన రాజశేఖరునిపై కేసులు బనాయించినప్పుడే కల చెదిరింది కథ మారింది! రాహుల్ గాంధీని (rahul gandhi) ప్ర‌ధానిగా చూడ‌ట‌మే త‌న తండ్రి క‌ల అని ఆ క‌ల కోసం తాను ప‌నిచేస్తాన‌ని నిన్న ష‌ర్మిళ కాంగ్రెస్‌లో పార్టీలో చేరిన‌ప్పుడు అన్నారు. మ‌రి అదే వైఎస్ రాజశేఖ‌ర్ రెడ్డిపై కేసులు వేసిన‌ప్పుడే ఆ క‌ల చెదిరింది క‌దా అన్న ఉద్దేశంతో రాంబాబు ఇలా సెటైర్ వేసారు.