Covid: పెరుగుతున్న కేసులు.. మ‌ళ్లీ లాక్‌డౌన్ త‌ప్ప‌దా?

Covid: కోవిడ్ కొత్త ఉప‌ర‌కం .1 తీవ్రంగా వ్యాపిస్తోంది. ఇప్ప‌టికే కేర‌ళ‌లో దాదాపు 15 మంది మృతిచెందిన‌ట్లు అక్క‌డి ప్ర‌భుత్వం చెప్తోంది. తెలంగాణ‌లో ఇప్ప‌టికే 20 కేసులు ఉన్నాయి. GHMC ప‌రిధిలో 6 కేసులు న‌మోద‌య్యాయి. ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆరోగ్య శాఖ హెచ్చ‌రిస్తోంది. ఇలాగే కొన‌సాగితే కేసులు మ‌రిన్ని పెరిగిపోయి మ‌ళ్లీ తాత్కాలిక లాక్‌డౌన్ ఏర్ప‌డే ప‌రిస్థితులు లేక‌పోలేద‌న్న టాక్ కూడా వినిపిస్తోంది.