Peddapalli: ఆస్తి కోసం భర్త అంత్యక్రియలను అడ్డుకున్న భార్య

wife obstructed final rights of her husband for property

Peddapalli: ఆస్తి రాసిస్తేనే భ‌ర్త అంత్య‌క్రియ‌లకు అనుమ‌తిస్తానంటూ ఓ యువ‌తి ర‌చ్చ చేసిన ఘ‌ట‌న పెద్దప‌ల్లిలోని మంథ‌ని ప్రాంతంలో చోటుచేసుకుంది. విలోచవరం గ్రామానికి చెందిన సునీల్ (36)కు నాలుగేళ్ల కింద సంధ్య అనే యువ‌తితో వివాహమైంది. వీరికి ఓ బాబు ఉన్నాడు. సునీల్, సంధ్య మధ్య గొడవలు జరగడంతో ఏడాది నుంచి ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. అనారోగ్యం కారణంగా సునీల్ మూడు రోజుల క్రితం హైదరాబాద్లో చనిపోయాడు. దీంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు అతడి కుటుంబ సభ్యులు మంథనిలోని గోదావరి ఒడ్డుకు తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న సంధ్య కుటుంబ సభ్యులతో కలిసి మంథనికి చేరుకొని అంత్యక్రియలు అడ్డుకుంది. సునీల్ ఆస్తిలో తన కుమారుడికి వాటా ఇవ్వాలని పట్టుబట్టింది.