Viral News: హ‌నీమూన్‌కి అయోధ్య‌.. విడాకులు ఇచ్చిన భార్య‌!

Viral News: హ‌నీమూన్‌కి తీసుకెళ్తాన‌ని చెప్పి అయోధ్య రామ‌య్య ద‌ర్శ‌నానికి తీసుకెళ్లాడ‌ని విడాకులు ఇచ్చేసింది ఓ మ‌హిళ‌. ఈ ఘ‌ట‌న మధ్య‌ప్ర‌దేశ్‌లో చోటుచేసుకుంది. గ‌తేడాది ఆగ‌స్ట్‌లో పెళ్లి చేసుకున్న భోపాల్‌కు చెందిన జంట‌.. ఈ ఏడాది గోవాకు హ‌నీమూన్‌కి వెళ్లాల‌ని ఉంద‌ని భార్య ప్రేమ‌గా అడిగింది. ఇందుకు భ‌ర్త ఒప్పుకున్న‌ట్లే ఒప్పుకుని ఆమెను అయోధ్య ద‌ర్శ‌నానికి తీసుకెళ్లాడు. దాంతో ఆమెకు ఒళ్లు మండిపోయింది. వెంట‌నే విడాకుల‌కు అప్లై చేసింది. పెళ్లి జ‌రిగిన మొద‌టి రోజు నుంచి త‌న భ‌ర్త కేవ‌లం త‌న త‌ల్లిదండ్రుల‌కే విలువ ఇస్తున్నాడ‌ని త‌న ఇష్టాల‌ను ప‌ట్టించుకోవడంలేద‌ని విడాకుల ద‌ర‌ఖాస్తులో త‌న బాధ‌ను వ్య‌క్త‌ప‌రిచింది. ప్ర‌స్తుతం ఈ కేసు విష‌యంలో వాద‌న‌లు జ‌రుగుతున్నాయి.