లాయ‌ర్ క్యాబిన్‌లోనే విధ‌వ‌పై అత్యాచారం

Viral News: సాయం కోసం వ‌చ్చిన ఓ విధ‌వ‌పై లాయ‌ర్ వ‌ద్ద ఫైనాన్షియ‌ర్‌గా ప‌నిచేస్తున్న ఓ వ్య‌క్తి అమానుషంగా ప్ర‌వర్తించాడు. లాయ‌ర్ లేని స‌మ‌యం చూసి క్యాబిన్‌లోనే విధ‌వ‌పై అత్యాచారం చేసాడు. ఈ ఘ‌ట‌న లుధియానాలో చోటుచేసుకుంది.

స్థానిక బ‌ర్సల్ గ్రామానికి చెందిన ప‌ర్వీంద‌ర్ సింగ్ అనే ఫైనాన్షియ‌ర్ కుమార్తె చ‌దువు కోసం లోన్ ఇప్పిస్తాన‌ని స‌ద‌రు మ‌హిళ‌ను త‌న ఆఫీస్‌కు పిలిపించుకున్నాడు. ఆమె లోన్ వ‌స్తుంద‌న్న ఆశ‌తో ఆఫీస్‌కు వెళ్ల‌గా.. అక్క‌డ బాగా తాగేసి ఉన్న ప‌ర్వీంద‌ర్ ఆమెను రేప్ చేసాడు. గ‌తేడాది ఆమె భ‌ర్త చ‌ద‌వ‌డంతో డ‌బ్బుల‌కు ఎంతో ఇబ్బంది ప‌డిన ఆ మ‌హిళ త‌న కుమార్తె చ‌దువుకు లోన్ కావాల‌ని సుఖ్‌బీర్ అనే లాయర్‌ను సంప్ర‌దించింది. అత‌ను ప‌ర్వీంద‌ర్‌ను ప‌రిచ‌యం చేసాడు. దీనిని ఆస‌ర‌గా చేసుకుని సాయం కోసం వ‌చ్చిన మ‌హిళ‌పై అత్యాచారానికి పాల్ప‌డిన ప‌ర్వీంద‌ర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇలాంటి మ‌రిన్ని వార్త‌లు చ‌ద‌వడానికి చూడండి https://telugu.newsx.com/