Viral News: ఆ రాష్ట్ర‌ గ‌ర్భిణులు అదే రోజున బిడ్డ‌ను క‌నాల‌నుకుంటున్నారు.. ఎందుకో తెలుసా?

Viral News: అయోధ్య‌లో ఈ నెల 22న రాముడి విగ్ర‌హ ప్రాణ ప్ర‌తిష్ఠ చేయనున్నారు. దాంతో ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని గ‌ర్భిణులు అంతా క‌లిసి ఓ నిర్ణాయ‌నికి వ‌చ్చారు. ఏరోజైతే రాముడి విగ్ర‌హాన్ని ప్రాణ ప్ర‌తిష్ఠ చేస్తారో అదే రోజున బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వాల‌ని అనుకుంటున్నారు. ఇలా ఒక‌రో ఇద్ద‌రో అనుకుంటే ఫ‌ర్వాలేదు. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని నెల‌లు నిండుతున్న గ‌ర్భిణులు అంతా కూడా ఇదే నిర్ణ‌యంతో ఉన్నారు. ఇందుకోసం స్థానిక హాస్పిట‌ల్స్‌లో ముందే ద‌ర‌ఖాస్తులు పెట్టుకుంటున్నారు.

ఒక‌వేళ బిడ్డను క‌నే సమ‌యం ఇంకా రాక‌పోయిన‌ప్ప‌టికీ సిజేరియ‌న్ చేసి మ‌రీ తీయాల‌ని కోరుతున్నార‌ట‌. దాంతో స్థానిక హాస్పిట‌ల్‌లోని వైద్యులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. రాముడి ప్రాణ ప్ర‌తిష్ఠ రోజే డెలివ‌రీ అవ్వాల‌ని కోరుతున్నార‌ని ఇలా దాదాపు 100కు పైగా ద‌ర‌ఖాస్తులు అందాయ‌ని చెప్తున్నారు. అంద‌రికీ ఒకేసారి సిజేరియ‌న్‌లు చేయ‌డం కుద‌ర‌ని ప‌ని అని ఈ విష‌యంలో ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఏదో ఒక చ‌ర్య తీసుకోవాల్సిందేన‌ని కోరుతున్నారు.