Delhi: ఇజ్రాయెల్ ఎంబ‌సీ వ‌ద్ద బాంబు పేలుడు

Delhi: దేశ రాజ‌ధాని ఢిల్లీ బాంబు పేలుడుతో ఉలిక్కి ప‌డింది. ఢిల్లీలోని ఇజ్రాయెల్ దౌత్య కార్యాల‌యం (israel embassy) వ‌ద్ద బాంబు పేలుడు చోటుచేసుకుంది. అయితే ఎవ‌రికీ ఎలాంటి హాని జ‌ర‌గ‌లేదు. పోలీసులు, భ‌ద్ర‌తా బ‌ల‌గాలు, బాంబ్ స్వ్కాడ్‌లు ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకున్నారు. కేసును విచారిస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు. పేలుడు సంభ‌వించిందని ఓ గుర్తు తెలియ‌ని వ్య‌క్తి ఢిల్లీ అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేసి స‌మాచారం అందించాడు. ఘ‌ట‌నా స్థ‌లిలో ఎలాంటి ప్ర‌మాద‌క‌ర వ‌స్తువులు దొర‌క‌లేద‌ని అధికారులు పేర్కొన్నారు.