Palnadu: ఆస్తి కోసం పెంచిన తల్లిని చిత్రహింసలకు గురిచేసి చంపిన కసాయి కొడుకు

Palnadu: ఆస్తి కోసం పెంచిన త‌ల్లిని పొట్ట‌న‌బెట్టుకున్నాడు ఓ క‌సాయి వ్య‌క్తి. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం శంకరాపురం గ్రామానికి చెందిన‌ బాణావత్ లక్ష్మీబాయి అనే మ‌హిళ త‌న‌ సవతి కొడుకు అయిన‌ దత్తు నాయక్‌ను చిన్నప్పటి నుండి పెంచింది. దత్తు నాయక్‌ కొన్ని రోజులుగా ఇంటిని తన పేరుపైన రాయాలని లక్ష్మీబాయిని వేధిస్తున్నాడు. దీనికి ఒప్పుకోకపోవడంతో అర్ధరాత్రి లక్ష్మీబాయి నిద్రిస్తుండగా ఆమె కాళ్లకు కరెంట్ వైర్లను పెట్టి చిత్రహింసలకు గురిచేసి ఆమె తలపై గునపంతో కొట్టి హత్య చేశాడు.