Maharashtra: దారుణం.. క్రేన్ కూలి వ‌ర్క‌ర్లు దుర్మ‌ర‌ణం

Mumbai: మ‌హారాష్ట్ర‌లో దారుణం చోటుచేసుకుంది. అర్థ‌రాత్రి స‌మృద్ధి ఎక్స్‌ప్రెస్ వే ద‌గ్గ‌ర నిర్మాణ ప‌నులు జ‌రుగుతుండ‌గా ఒక్క‌సారిగా క్రేన్ కుప్పకూలిపోయింది. దాంతో అక్క‌డే ప‌నిచేస్తున్న దాదాపు 16 మంది వ‌ర్క‌ర్లు అక్కడికక్క‌డే మృతిచెందారు. మ‌రో ఐదుగురు క్రేన్ కింద ఇరుక్కున్న‌ట్లు తెలుస్తోంది. (maharashtra) తీవ్రంగా గాయ‌ప‌డిన వారిని దగ్గ‌ర్లోని హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో వ‌ర్క‌ర్లు గిర్డ‌ర్ లాంచింగ్ మెషీన్‌ని ఆప‌రేట్ చేస్తున్నారు. ఈ గిర్డ‌ర్ మెషీన్ అనేది ఓ స్పెష‌ల్ క్రేన్. దీనిని హైవేలు, రైల్వే బ్రిడ్జిలు, భారీ బిల్డింగుల‌ను నిర్మించ‌డానికి ఈ గిర్డ‌ర్ల‌ను వాడ‌తారు. ఈ గిర్డ‌ర్ల‌ను ఆ క్రేన్‌తో త‌ర‌లిస్తున్న స‌మయంలో బరువు ఎక్కువై కుప్ప‌కూలిపోయింది. మృతుల కుటుంబాల‌కు ప్ర‌ధాని నరేంద్ర మోదీ రూ.2 ల‌క్షల ఆర్థిక సాయం, గాయ‌ప‌డిన వారికి రూ.50,000 ప‌రిహారం ప్ర‌క‌టించారు.