ఆరేళ్ల బిడ్డ‌ను మొస‌ళ్లున్న కాలువ‌లోకి విసిరేసిన త‌ల్లి

karnataka woman throws son in lake infested with crocodiles

Viral News: క‌న్న త‌ల్లే బిడ్డ‌ను చంపేసింది. అతి దారుణంగా మొస‌ళ్లున్న కాలువ‌లోకి విసిరేయ‌డంతో ఆ బిడ్డ మొస‌ళ్ల‌కు ఆహారంగా మారిపోయి ప్రాణాలు వ‌దిలాడు. ఈ దారుణ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లో చోటుచేసుకుంది. ఉత్త‌ర క‌న్న‌డ జిల్లాకు చెందిన సావిత్రి, ర‌వికుమార్ దంప‌తుల‌కు ఆరేళ్ల వినోద్ అనే కుమారుడు ఉన్నాడు. వినోద్ పుట్టుక‌తోనే అవిటివాడు. దాంతో బాలుడ్ని ఎలాగైనా వ‌దిలించుకోవాల‌ని అనుకున్నారు. ఈ విష‌యంలో నిన్న రాత్రి సావిత్రి, ర‌వికుమార్‌ల మ‌ధ్య పెద్ద ఘ‌ర్ష‌ణ చోటుచేసుకుంది. దాంతో సావిత్రి ముందు వెన‌క ఆలోచించ‌కుండా క్ష‌ణికావేశంలో నిద్ర‌పోతున్న కుమారుడిని ఎత్తుకుని ద‌గ్గ‌ర్లో ఉన్న కాలువ‌లో ప‌డేసింది.

ఆ కాలువ స్థానిక కాళీ న‌దికి అనుసంధానంగా ఉంది. కాళీ న‌దిలో మొస‌ళ్లు ఎక్కువ‌. అందుకే ఆ న‌ది వైపు ఎవ్వ‌రూ వెళ్ల‌రు. ఈ విష‌యం తెలుసుకున్న చుట్టుప‌క్క‌ల వారు వెంట‌నే పోలీసుల‌ను అప్ర‌మ‌త్తం చేసారు. ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు అగ్నిమాప‌క శాఖ‌కు చెందిన ఈత‌గాళ్ల‌ను పిలిపించి వెతికించే ప్ర‌య‌త్నం చేసారు. రాత్రి అయిపోవ‌డంతో బాలుడిని వెత‌క‌డం క‌ష్టంగా మారింది. ఈరోజు ఉద‌యాన్నే మ‌ళ్లీ వారి చేత వెతికించ‌డంతో అప్ప‌టికే బాలుడి కుడి చేయి అక్క‌డే ఉన్న మొస‌లి నోట్లు ఉండ‌టం చూసి పోలీసులు షాక‌య్యారు. మిగ‌తా శ‌రీరాన్ని కూడా మొస‌ళ్లు పీక్కుతినేయ‌డంతో స్థానికులు భ‌య‌భ్రాంతుల‌కు గుర‌య్యారు. ఇంత‌టి పాపానికి ఒడిగ‌ట్టిన త‌ల్లిదండ్రుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.