Viral News: కొబ్బ‌రి బోండాల‌పై డ్రైనేజ్ నీళ్లు..వ్యాపారి అరెస్ట్

Noida: ప్ర‌జ‌లు ఏమైపోయినా ఫ‌ర్వాలేదు మ‌న వ్యాపారం బాగుండాలి అనుకున్న ఓ వ్య‌క్తి చివ‌ర‌కు క‌ట‌క‌టాల పాల‌య్యాడు (viral news). ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని (uttar pradesh) నోయిడాకు చెందిన స‌మీర్ అనే వ్య‌క్తి కొబ్బ‌రిబోండాలు  (coconuts) అమ్ముకుంటూ జీవ‌నం సాగిస్తున్నాడు. బోండాలు ఫ్రెష్‌గా క‌నిపించేందుకు వాటిపై ప‌క్క‌నే ఉన్న డ్రైనేజ్ నీళ్ల‌ను వాడాడు. ఈ దృశ్యాన్ని స్థానికులు వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో యూపీ పోలీసుల దృష్టికి వ‌చ్చింది. వెంట‌నే స‌మీర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అత‌ని ప‌లు సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేసారు. ఈ మ‌ధ్య‌కాలంలో చాలా మంది చిరు వ్యాపారులు త‌మ వ్యాపారం బాగుంటే చాలు అనుకుని ప‌రిశుభ్ర‌త‌ను పాటించ‌డంలేదు. ఇటీవ‌ల ఓ పానీపూరి వ్యాపారి త‌న షాపులో ఉన్న ప్లేట్లు క‌డ‌గ‌డానికి మురికి కాలువ‌లో ఉన్న నీటిని వాడుతున్న దృశ్యం కూడా వైర‌ల్‌గా మారింది. ఇలాంటివారి నుంచి తిండి తిన‌క‌పోవ‌డ‌మే మంచిద‌ని వైద్య నిపుణులు చెప్తున్నారు.