Yadadri: అగ్రిక‌ల్చ‌ర్ ఆఫీస్‌లో అక్ర‌మ సంబంధం

Yadadri: యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో కత్తిపోటుల కలకలం సృష్టించింది. అగ్రికల్చర్ ఆఫీసులో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగుల మధ్య దాడి చోటుచేసుకుంది. అక్రమ సంబంధమే కారణం అని తోటి ఉద్యోగులు చెప్తున్నారు.

ఆఫీస్‌లో ప‌నిచేస్తున్న‌ అయిన‌ శిల్ప అనే యువ‌తికి 2012లో సుధీర్‌తో వివాహం జ‌రిగింది. వీరికి ఒక బాబు ఉన్నాడు. అయితే 2 సంవ‌త్స‌రాలుగా సుధీర్ దూరంగా ఉంటుండంతో అదే ఆఫీస్‌లో ప‌నిచేస్తున్న మ‌నోజ్ అనే వ్య‌క్తితో శిల్ప అక్ర‌మ సంబంధం పెట్టుకుంది. శిల్ప గోల భరించలేక రెండు నెల‌ల పాటు మ‌నోజ్ సెల‌వులో ఉన్నాడు. సెల‌వు పూర్త‌వ‌డంతో తిరిగి ఉద్యోగంలో చేరడానికి జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంకు వ‌చ్చాడు. మ‌నోజ్‌ను చూసిన శిల్ప ఎందుకు దూరంగా ఉంటున్నావ్ అని గొడ‌వ‌పెట్టుకుంది.

ఇద్ద‌రి మ‌ధ్య మాటా మాటా పెరిగి పెద్ద గొడ‌వ‌కు దారి తీసింది. దాంతో మ‌నోజ్ త‌నతో పాటు తెచ్చుకున్న క‌త్తితో శిల్ప‌పై దాడి చేయ‌బోయాడు. శిల్ప ఆ క‌త్తిని లాక్కుని మ‌నోజ్‌పై దాడి చేసింది. ఇద్ద‌రికీ గాయాల‌య్యాయి. వారిని స్థానిక హాస్పిట‌ల్‌కు త‌ర‌లించి పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు.