Tirupati: మ‌నిషిని పీక్కుతిన్న సింహం.. అస‌లేం జ‌రిగింది?

Tirupati: తిరుప‌తిలో దారుణం చోటుచేసుకుంది. స్థానిక జూ పార్క్‌లోకి ఓ వ్య‌క్తి దూక‌డంతో సింహం దాడి చేసి అత‌న్ని చంపేసింది. మృతుడు రాజ‌స్థాన్‌కు చెందిన ప్ర‌హ్లాద్ గుర్జార్‌గా పోలీసులు గుర్తించారు.

అస‌లేం జ‌రిగింది?

ప్ర‌హ్లాద్ గుర్జార్ సింహానికి ఆహారం పెట్టే బోను ద్వారా ఎన్‌క్లోజ‌ర్‌లోకి వెళ్లిన‌ట్లు పోలీసులు చెప్తున్నారు. సింహాల‌కు అహారం వేసే బోను మ‌నిషి ప‌ట్టేంత పెద్ద‌గా ఏమీ ఉండ‌దు. అలాంటిది ప్ర‌హ్లాద్ లోప‌లికి వెళ్లాడు అంటే బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డి ఉంటాడా అనే కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు.

ప‌హ్లాద్ చ‌నిపోయిన స‌మ‌యానికే ఎన్‌క్లోజ‌ర్‌లో ఒక మ‌గ సింహం రెండు ఆడ సింహాలు ఉన్న‌ట్లు అధికారులు చెప్తున్నారు. ప్ర‌హ్లాద్‌ను చంపిన సింహం దొంగ‌ల‌పూర్ జాతికి చెందిన‌దిగా భావిస్తున్నారు. సింహాల ఎన్‌క్లోజ‌ర్‌లోకి వెళ్లే ద్వారం కూడా స‌రిగ్గా నిర్మించిలేద‌ట‌. దాంతో అత‌ను ప్ర‌మాద‌వ‌శాత్తు ప‌డిపోయి ఉంటాడ‌న్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకుని ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు.