Tirumala: నో ఫ్ల‌యింగ్ జోన్‌లో ఎగిరిన హెలికాప్ట‌ర్

Tirumala: తిరుమ‌ల ప్రాంతానికి నో ఫ్ల‌యింగ్ జోన్‌గా ప్ర‌క‌టించారు. అంటే తిరుమ‌ల మీదుగా ఎలాంటి హెలికాప్ట‌ర్లు, విమానాలు, డ్రోన్లు వెళ్ల‌డానికి వీల్లేదు. అలాంటిది ఈరోజు ఓ హెలికాప్ట‌ర్ తిరుమ‌ల మీద నుంచి వెళ్ల‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. తిరుమల శ్రీవారి పవిత్రతను కాపాడే విషయంలో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం వారు ఎప్పుడూ వెనుకబడుతూనే ఉంది. గతంలో చిన్న విమానాలు నో ఫ్లై జోన్ అయిన ఆలయంపై ఎగిరినప్పటికీ పెద్దగా పట్టించుకోకపోవడంతో ఇప్పుడు అత్యంత సమీపంలో హెలికాఫ్టర్లు పయనించాయి. ఈ హెలికాఫ్టర్లు ఎవరివి అన్నదానిపై స్పష్టత లేదు. ఇటీవల డ్రోన్ షాట్స్ దృశ్యాలు, ఆలయంలో సెల్ ఫోన్‌తో షూట్ చేసిన దృశ్యాలు కూడా వెలుగులోకి వచ్చాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇలా శ్రీవారి ఆలయ పవిత్రకు భంగం కలిగేలా ఘటనలు చోటు చేసుకోలేదు. వీటిపై భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నా .. TTD పట్టించుకోవడం లేదు.