Telangana: ఫ్యాక్ట‌రీలో భారీ పేలుడు.. 5 మృతి

Telangana: తెలంగాణ‌లోని సంగారెడ్డిలోని ఓ కార్మాగారంలో భారీ పేలుడు సంభ‌వించింది. కెమిక‌ల్ ఫ్యాక్టరీలోని రియాక్ట‌ర్ పేలిపోడంతో ఐదుగురు మృతిచెంద‌గా మ‌రో 10 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స్థానిక ఎస్‌బీ ఆర్గానిక్ ప‌రిశ్ర‌మ‌లో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. మృతుల్లో ప‌రిశ్ర‌మ డైరెక్ట‌ర్ కూడా ఉన్న‌ట్లు స‌మాచారం. మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంది. అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని మంట‌లు ఆర్పేందుకు య‌త్నిస్తున్నారు.