Crime: భార్య‌ను “కొనుక్కుని”.. ఆపై హ‌త్య‌

Delhi: ఓ వ్య‌క్తి భార్య‌ను కొనుగోలు చేసి దారుణానికి (crime) పాల్ప‌డ్డాడు. దిల్లీకి (delhi) చెందిన ధ‌ర‌మ్‌వీర్ అనే వ్య‌క్తి కొంత‌కాలం క్రితం బిహార్ (bihar) వెళ్లాడు. అక్క‌డ స్వీటీ అనే యువ‌తిని రూ.70,000కి కొనుక్కుని తెచ్చుకున్నాడు. అయితే స్వీటీ చెప్ప‌కుండా ప‌లుమార్లు ఇంట్లో నుంచి ఎవరితోనో లేచిపోతూ ఉండేద‌ట‌. ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా ఆమె ప‌ద్ధ‌తి మార్చుకోలేదు. దాంతో విసిగిపోయిన ధ‌ర‌మ్‌వీర్ త‌న బంధువులైన అరుణ్, స‌త్య‌వ‌న్‌ల‌తో క‌లిసి ఎలాగైనా స్వీటీని చంపాల‌న్న ప్లాన్ వేసారు. రైల్వేస్టేష‌న్‌లో దించుతాం అని న‌మ్మించి అర్థ‌రాత్రి 1 గంట స‌మ‌యంలో ఆటోలో ఎక్కించుకుని ఫ‌తేపురి బేరి స‌మీపంలోని అట‌వీ ప్రాంతంలో ఆమె గొంతు నులిపి అక్క‌డే శ‌వాన్ని విసిరేసి వెళ్లిపోయారు. ఆ మ‌రుస‌టి రోజు దిల్లీ పోలీసుల‌కు స‌మాచారం అందింది.

పోలీసులు మృత‌దేహాన్ని పోస్ట్‌మార్టంకు త‌ర‌లించారు. ఆ త‌ర్వాత విచార‌ణ ప్రారంభించారు. CCTV ప‌రిశీలించ‌గా రాత్రి 1 గంట స‌మ‌యంలో ఆటో వెళ్తున్న దృశ్యాన్ని చూసారు. ఆ ఆటో నెంబర్ ద్వారా నిందితుల్లో ఒక‌రైన అరుణ్‌ని అదుపులోకి తీసుకుని ప్ర‌శ్నించారు. అత‌ను అస‌లు విష‌యాన్ని వెల్ల‌డించాడు. మ‌రో ఇద్ద‌రు నిందితుల కోసం గాలింపులు చేప‌డుతున్న‌ట్లు పోలీసులు తెలిపారు. (crime)