మూడో భార్య‌కు న‌చ్చ‌లేదని.. క‌న్న‌బిడ్డ‌ను చంపేసాడు

Indore: మూడో భార్య‌కు న‌చ్చ‌లేద‌ని క‌న్న‌బిడ్డ‌నే చంపేసాడు ఓ క‌సాయి తండ్రి(crime). ఈ దారుణ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో(madhya pradesh) చోటుచేసుకుంది. ఇండోర్‌కు చెందిన శ‌శిపాల్ అనే వ్య‌క్తి.. మొద‌టి భార్య చ‌నిపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ప్ర‌తీక్ అనే కుమారుడు పుట్టాడు. ఆ తర్వాత రెండో భార్య‌తో విడిపోయి పాయ‌ల్ అనే మూడో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో కూడా ఓ బిడ్డ‌ను క‌న్నాడు. అయితే ప్ర‌తీక్ అంటే ఇష్ట‌ప‌డని పాయ‌ల్.. వాడు ఇంట్లో ఉంటే రానంటూ బిడ్డ‌ను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. దాంతో భార్యను ఇంటికి ర‌ప్పించ‌డం కోసం ప్ర‌తీక్‌ను చంపాల‌నుకున్నాడు.

రోజూ అమ్మ‌మ్మ, తాత‌య్య‌ల ద‌గ్గ‌ర ప‌డుకునే ప్ర‌తీక్‌ను.. సోమ‌వారం రోజున త‌న వ‌ద్ద ప‌డుకోవాల‌ని కూల‌ర్ వేస్తాన‌ని చెప్పాడు. కూల‌ర్ కోసం ప్ర‌తీక్ తండ్రి ద‌గ్గ‌ర ప‌డుకుంటాన‌ని వెళ్లాడు. ప్ర‌తీక్ నిద్ర‌లోకి జారుకోగానే టీవీ సౌండ్ ఎక్కువ‌గా పెట్టి గొంతు నులిమి చంపేసాడు. చంపుతున్న స‌మ‌యంలో పాయ‌ల్‌కు చూపించ‌డానికి వీడియో కాల్ చేసాడు. కానీ ఆమె లిఫ్ట్ చేయ‌లేదు. ఆ త‌ర్వాత వీడియో తీసి ఆమెకు వాట్సాప్ చేసాడు. అప్ప‌టిక‌ప్పుడే ఇంట్లో నుంచి పారిపోయాడు. ఉద‌యాన్నే పోలీసుల‌కు స‌మాచారం అందడంతో పాయ‌ల్‌ని, శ‌శిపాల్‌ను అరెస్ట్ చేసారు. ప్ర‌తీక్‌ను వ‌దిలించుకోవాల‌ని చెప్పానే కానీ చంప‌మ‌ని చెప్ప‌లేద‌ని, ఈ హ‌త్య‌తో త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని పాయ‌ల్ పోలీసుల‌కు తెలిపింది.