ఓటెయ్యండి.. వ‌జ్రాలు గెలుచుకోండి..!

bhopal voters gets diamond rings if they come out to vote

Viral News: ఓటు వేస్తే డైమండ్ రింగ్స్ కానుక‌గా ఇస్తామ‌ని ఓట‌ర్ల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చింది మ‌ధ్యప్ర‌దేశ్ రాజధాని భోపాల్ నియోజ‌క‌వ‌ర్గం. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న లోక్ స‌భ ఎన్నిక‌ల్లో భాగంగా ఈరోజు మూడో ద‌శ పోలింగ్ జ‌రుగుతోంది. అయితే భోపాల్‌లో ఎప్పుడూ కూడా ప్ర‌జ‌లు బ‌య‌టికి వ‌చ్చి ఓటు హ‌క్కును వినియోగించుకున్న‌ది లేదు. ప్ర‌తి ప‌ది మందిలో కేవ‌లం 2 మాత్ర‌మే ఓటు వేస్తున్నారు.

దాంతో ఎలాగైనా ఓట్ల శాతం పెర‌గాల‌ని.. స్థానిక అధికారులు ఓ బంప‌ర్ ఆఫర్ ఇచ్చారు. ఓట్లు వేయ‌డానికి వ‌చ్చిన వారికి ప్ర‌తి రెండు గంట‌ల‌కు ల‌క్కీ డ్రా ద్వారా డైమండ్ రింగ్స్ ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. దాంతో ఓట‌ర్లు ఓటు వేసేందుకు పోలింగ్ బూత్‌ల‌కు పోటెత్తారు. అయితే అస‌లు ట్విస్ట్ ఇక్క‌డే ఉంది. వారు ఇచ్చేది అస‌లైన డైమండ్ ఉంగ‌రాలు కాద‌ట‌. చీప్‌గా దొరికే అమెరిక‌న్ డైమండ్ ఉంగ‌రాల‌ట‌. ఓట‌ర్లను నమ్మించేందుకు ప్యాకింగ్ డ‌బ్బాల‌ను మాత్రం స్థానిక ఫేమ‌స్ వ‌జ్రాల దుకాణం నుంచి తెప్పించి అందులో చీప్‌గా కొనుగోలు చేసిన అమెరిక‌న్ డైమండ్ రింగుల‌ను పెట్టి ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టారు. ఈ విష‌యం కొంత మందికి మాత్ర‌మే తెలుసట‌. దాంతో వారు జిల్లా క‌లెక్ట‌ర్‌ను ఆశ్ర‌యించ‌గా.. ఓటింగ్ శాతం పెంచేందుకే ఇలా చేసామ‌ని.. నిజ‌మైన వ‌జ్రాలు కొనుగోలు చేయ‌డానికి త‌మ వ‌ద్ద మాత్రం అంత డ‌బ్బు ఎక్క‌డిది అని తెలిపారు.