IND vs AUS: ఓటమిని జీర్ణించుకోలేక గుండెపోటుతో మృతి

IND vs AUS: వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత జట్టు ఓటమిని జీర్ణించుకోలేక తిరుపతి మండలం దుర్గసముద్రానికి చెందిన జ్యోతి కుమార్ యాదవ్ అనే వ్య‌క్తి గుండెపోటుతో మృతిచెందాడు. టీమిండియా ఓటమి అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ కన్నీళ్లు పెట్టుకున్న వీడియోలు చూస్తూ జ్యోతి కుమార్ చలించిపోయాడు. అకస్మాత్తుగా కుప్పకూలాడు. స్నేహితులు వెంటనే అతడిని తిరుపతిలోని ఓ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.