Viral news: బిడ్డ‌ను సూప‌ర్‌మార్కెట్‌లో అమ్మేసిన త‌ల్లి

America: క‌న్న‌త‌ల్లే(mother) బిడ్డ‌ను సూప‌ర్‌మార్కెట్లో (supermarket) అమ్మేసిన ఘ‌ట‌న అమెరికాలోని(america) టెక్సాస్(texas) రాష్ట్రంలో చోటుచేసుకుంది. కొన్ని రోజుల పాటు బిడ్డ క‌నిపించ‌కుండా పోవ‌డంతో బంధువులు పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు. అలా ఈ దారుణం బ‌య‌ట‌ప‌డ‌డంతో వైర‌ల్‌ (viral)గా మారింది. టెక్సాస్‌కు చెందిన నోయ‌ల్ అనే బాలుడు మార్చి 25న క‌నిపించ‌కుండాపోయాడు. నోయ‌ల్ తల్లి వేరే పెళ్లి చేసుకుంది. అలా త‌న భ‌ర్త‌, ఆరుగురు పిల్ల‌ల‌తో క‌లిసి నోయ‌ల్‌తో క‌లిసి టెక్సాస్‌లో ఉంటోంది. చివ‌రిసారిగా నోయ‌ల్ బంధువులు అత‌ను ఇంటి వెన‌క ఆడుకుంటూ క‌నిపించాడ‌ట‌. ఆ తర్వాత నుంచి క‌నిపించ‌లేదు. దాంతో పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు (viral news)

విచార‌ణ‌లో భాగంగా పోలీసులు నోయ‌ల్ త‌ల్లి సిండీను అదుపులోకి తీసుకుని విచారించారు. త‌న‌కు ఏమీ తెలీద‌ని, నోయ‌ల్ త‌న తండ్రి ద‌గ్గ‌రికి వెళ్లాడ‌నుకున్నాన‌ని తెలిపింది. అయితే నోయ‌ల్‌ను ఓ ప్ర‌దేశంలోని సూప‌ర్‌మార్కెట్‌లో సిండీ అమ్మేసింద‌ని బంధువు ఒక‌రు పోలీసుల‌కు తెలిపారు. వెంట‌నే బాలుడిని బంధువ‌ల‌కు అప్ప‌గించారు. నోయ‌ల్‌కి దెయ్యం ప‌ట్టిందని, త‌నకు పుట్టిన క‌వ‌ల పిల్ల‌ల‌కు హాని క‌లిగిస్తాడేమోన‌ని అమ్మేసిన‌ట్లు సిండీ తెలిపింది (viral news). సిండీ నోయ‌ల్‌ను కొడుతూ ఉంటుంద‌ని, నీళ్లు తాగితే డైప‌ర్‌లో మూత్రం పోస్తాడ‌ని మంచి నీరు కూడా ఇచ్చేది కాద‌ని, ఫుడ్ పెడితే దుస్తులు మార్చాల్సి వ‌స్తుందని తిండికూడా పెట్ట‌కుండా న‌ర‌కం చూపించింద‌ని బంధువులు తెలిపారు. బాలుడిని త‌మ‌తో తీసుకెళ్తామ‌ని చెప్పడంతో పోలీసులు సిండీని అదుపులోకి తీసుకున్నారు.