venkatesh iyer: 15ఏళ్ల త‌ర్వాత KKRకు సెంచ‌రీ!

Mumbai: ముంబై ఇండియ‌న్స్ (mumbai indians), కోల్‌క‌త్తా నైట్ రైడ‌ర్స్ (kolkata knight riders) మధ్య ఆదివారం వాంఖడేలో జరిగిన మ్యాచ్‌లో వెంకటేశ్ అయ్యర్ సెంచ‌రీ బాదేశాడు. కేవలం 51 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్లు బాదిన వెంకటేశ్ అయ్యర్.. డ్యూన్ జాన్స‌న్(dune jhonson) వేసిన ఓవ‌ర్‌లో సింగిల్ తీసి ఐపీఎల్‌లో మొద‌టి సెంచ‌రీని ఖాతాలో వేసుకున్నాడు. అయితే.. ఐపీఎల్‌లో కేకేఆర్ టీమ్ తరఫున సెంచ‌రీ నమోదై దాదాపు 15 ఏళ్లు అవుతోంది. 2008లో బ్రెండ‌న్ మెక్‌క‌ల‌మ్ (brendon mccullum) కేకేఆర్ త‌ర‌ఫున ఆడి సెంచ‌రీ బాదాడు. ఆ తర్వ‌ాత ఈరోజు వ‌ర‌కు ఒక్క ప్లేయర్ కూడా కేకేఆర్ తరఫున సెంచ‌రీ చేయలేకపోయారు. ఎట్టకేలకి శనివారం ఆ లోటును వెంక‌టేష్ అయ్య‌ర్ తీర్చేశాడు. ఓవరాల్‌గా కేకేఆర్ త‌ర‌ఫున సెంచ‌రీ చేసిన రెండో బ్యాట‌ర్‌గా వెంక‌టేష్ అయ్య‌ర్ నిలిచాడు. ఇటీవల వ‌రుస‌గా ఐదు సిక్సర్లు బాదేసి లాస్ట్ ఓవర్‌లో కోల్‌కతాని గెలిపించి.. అంద‌రి దృష్టినీ ఆకర్షించిన రింకూ సింగ్‌కి కేకేఆర్ ఓన‌ర్‌, బాలీవుడ్ న‌టుడు షారుక్ ఖాన్‌ ఖ‌రీదైన కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇక‌ ఈరోజు మ్యాచ్‌లో సెంచరీ బాదిన వెంకటేష్‌కి షారూక్ ఏం గిఫ్ట్ ఇస్తారో చూడాలి మ‌రి!.