Telangana: ఇంట‌ర్ ఫెయిల్‌..8 మంది విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌

Hyderabad: మొన్న రిలీజైన ఇంట‌ర్ ఫ‌లితాల్లో(inter results) ఫెయిల‌వ‌డంతో తెలంగాణ(telangana) రాష్ట్ర వ్యాప్తంగా 8 మంది విద్యార్థులు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. మంగ‌ళ‌వారం ఇంట‌ర్ మొదటి, రెండో సంవ‌త్స‌ర ప‌రీక్ష‌ల రిజ‌ల్ట్స్ విడుద‌లయ్యాయి. అప్ప‌టినుంచి ఈరోజు వ‌ర‌కు 8 మంది విద్యార్థులు ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. చ‌నిపోయిన‌వారిలో ఐదుగురు హైద‌రాబాద్‌కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు.

గ‌తేడాది కూడా ఇలాగే ఫెయిల్ అయినందుకు మ‌న‌స్తాపంతో కొంద‌రు విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. దాంతో ఇంట‌ర్ బోర్డు.. స్టూడెంట్స్ కోసం కౌన్సిలింగ్ సెష‌న్లు కూడా ఏర్పాటుచేసింది. అయిన‌ప్ప‌టికీ విద్యార్థులు మెంట‌ల్‌గా డిస్ట‌ర్బ్ అయిపోయి ఇలాంటి అఘాయిత్యాల‌కు పాల్ప‌డుతుండ‌డం క‌ల‌వ‌ర‌పెడుతోంది. ఏప్రిల్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇంట‌ర్ రిజ‌ల్ట్స్ రిలీజ్ అయిన‌ప్పుడు కూడా దాదాపు 9 మంది స్టూడెంట్స్ ఫెయిల్ అయినందుకు సూసైడ్ చేసుకున్నారు.