Umar Akmal: కోహ్లీ లేక‌పోతే ధోనీ వెళ్లిపోతా అన్నాడు

Umar Akmal recalled an incident from Pakistan's tour of India

Umar Akmal:  పాకిస్థానీ క్రికెట‌ర్ ఉమ‌ర్ అక్మ‌ల్ విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీకి సంబంధించిన‌ ఓ ఆస‌క్తిక‌ర‌మైన అంశం గురించి ఓ కార్య‌క్ర‌మంలో పంచుకున్నారు. 2012 2013 స‌మ‌యంలో ODI మ్యాచ్ జ‌రుగుతుండ‌గా.. విరాట్ కోహ్లీ స‌రిగ్గా ఆడ‌లేక‌పోయాడ‌ట‌. ఆ స‌మ‌యంలో ధోనీ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. చివ‌రి ODI మ్యాచ్ స‌మ‌యంలో మేనేజ‌ర్ ధోనీకి ఓ మాట చెప్పాడ‌ట‌.

కోహ్లీ స‌రిగ్గా ఆడ‌టం లేదు కాబ‌ట్టి చివ‌రి గేమ్‌కు కోహ్లీ వ‌ద్ద‌ని అత‌న్ని ఇంటికి పంపించేయాల‌ని మేనేజ‌ర్ చెప్పాడ‌ట‌. అది విని ధోనీ కోపంతో ఊగిపోయాడు. రెండు మూడు గేమ్స్ ఆడ‌లేక‌పోయినంత మాత్రాన కోహ్లీని తీసేయ‌మ‌న‌డం స‌బ‌బు కాద‌ని.. కోహ్లీని పంపించేయాల‌నుకుంటే త‌న‌కు కూడా టికెట్ బుక్ చేస్తే ఇద్ద‌రం వెళ్లిపోతామ‌ని.. త‌న బ‌దులు సురేష్ రైనా కెప్టెన్‌గా ఉంటాడ‌ని చెప్పాడ‌ట‌. అది విన్న మేనేజ‌ర్ షాకై.. వ‌ద్దులే కోహ్లీని ఆడ‌నిద్దాం అని చెప్ప‌డంతో కోహ్లీ కెరీర్ నిల‌బ‌డిందని ఉమ‌ర్ అక్మ‌ల్ తెలిపాడు.