Rohit Sharma: ఆ ఒక్క ర‌న్ తీసుండాల్సింది.. టీం పట్ల రోహిత్ అసంతృప్తి

Rohit Sharma unhappy with team's performance

Rohit Sharma: నిన్న జ‌రిగిన శ్రీలంక వ‌ర్సెస్ ఇండియా మ్యాచ్ టై అవ‌డం ప‌ట్ల కెప్టెన్ రోహిత్ శ‌ర్మ అసంతృప్తి వ్య‌క్తం చేసారు. టీమిండియా ఆట‌గాళ్లు స్థిర‌త్వం కోల్పోయార‌ని అన్నారు. నిన్న టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక‌ను 230 ప‌రుగుల‌కు ప‌రిమితం చేసింది టీమిండియా. 230 సులువుగా కొట్టేయ‌చ్చులే అనుకున్నారు కానీ లంక స్పిన్న‌ర్లు రావ‌డంతో ఆట ఒక్క‌సారిగా వారి ఫేవ‌ర్‌లోకి వెళ్లిపోయింది. స్కోర్ దాటేయ‌చ్చు అని రోహిత్ అనుకున్న‌ప్ప‌టికీ మ‌నోళ్లు స్థిర‌త్వం కోల్పోయార‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. కేఎల్ రాహుల్, అక్ష‌ర్ ప‌టేల్ 57 ప‌రుగుల స్టాండ్‌లో ఉన్న‌ప్ప‌టికీ మ‌నం గెల‌వ‌లేక‌పోయాం. 14 బాల్స్‌లో ఒక్క విన్నింగ్ ర‌న్ కూడా తీయ‌లేక‌పోయామ‌ని రోహిత్ బాధ‌ప‌డ్డారు.