Ravichandran Ashwin: రూ.20 కోట్లు పెట్టి రోహిత్‌ని ఆ టీం కొనాల‌నుకుంటోంది

Ravichandran Ashwin says rcb might acquire rohit sharma for 20 crores

Ravichandran Ashwin: IPL 2025కి సంబంధించిన వేలం కార్య‌క్ర‌మం త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోతోంది. ఈ నేప‌థ్యంలో స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. రోహిత్ శ‌ర్మ‌కు ముంబై ఇండియ‌న్స్ నుంచి జ‌రిగిన అవ‌మానం నేప‌థ్యంలో ఈసారి రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు టీం ఆయ‌న్ను ఎలాగైనా కొనేయాల‌ని చూస్తోంద‌ట‌. ఇందుకు రూ.20 కోట్లు రోహిత్ శ‌ర్మ కోసం ప‌క్క‌న‌పెట్టింద‌ట‌. ముంబై ఇండియ‌న్స్ రోహిత్ శ‌ర్మ‌ను రిలీజ్ చేస్తే బాగుంటుంద‌ని రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు తెగ ఆరాట‌ప‌డిపోతోంద‌ని అశ్విన్ ఈ సంద‌ర్భంగా ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు.