MS Dhoni: కెమెరామ్యాన్‌పై ధోనీ మండిపాటు.. బాటిల్ విసిరి మ‌రీ..

MS Dhoni: చెన్నై సూప‌ర్ కింగ్స్ మ్యాచ్ జ‌రుగుతోందంటే.. 99% మంది ఆడియ‌న్స్ చూపు మ‌హేంద్ర సింగ్ ధోనీ పైనే ఉంటుంది. ధోనీ ఆడుతున్న‌ప్పుడు కెమెరామ్యాన్ అత‌నిపై ఫోక‌స్ చేస్తే త‌ప్పు లేదు కానీ.. ధోనీ స్టాండ్స్‌లో కూర్చుని మ్యాచ్ చూస్తున్నా కూడా ఫోక‌స్ చేయ‌డం ధోనీకి న‌చ్చ‌లేదు. నిన్న చెన్నై సూప‌ర్ కింగ్స్‌కి ల‌ఖ్‌నౌ సూపర్ జైంట్స్‌కి మ‌ధ్య మ్యాచ్ జ‌రిగిన విష‌యం తెలిసిందే.

6 వికెట్ల తేడాతో ల‌ఖ్‌నౌ సూప‌ర్ జైంట్స్ మ్యాచ్ గెలిచింది. అయితే నిన్న మ్యాచ్‌లో తొలిసారి కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) సెంచ‌రీ బాదాడు. అదే ఊపులో శివ‌మ్ డూబే కూడా విశ్వరూపం చూపించాడు. అయితే ఎప్పుడైతే రుతురాజ్, శివ‌మ్ డూబేలు ఆడుతున్న‌ప్పుడు వారి ఆటతీరుపై కెమెరామ్యాన్ ఫోక‌స్ చేయ‌కుండా కీల‌క స‌మ‌యాల్లో కేవ‌లం ధోనీనే చూపిస్తున్నాడు. దాంతో ధోనీకి ఒళ్లు మండింది. వారిపై ఫోక‌స్ పెట్టు అని వార్నింగ్ ఇస్తూ బాటిల్ విసిరాడు. ఆ స‌మ‌యంలో తీసిన వీడియో కాస్తా వైర‌ల్‌గా మారింది.

ALSO READ:

ధోనీ ఎంట్రీ.. చెవులు ప‌గిలిపోయాయ్

రుతుకి ఉన్న సపోర్ట్ హార్దిక్‌కి లేక‌పోవ‌డం బాధాక‌రం