Rohit Sharma: ప్లీజ్ రోహిత్ MIలోనే ఉండు.. నీతా అంబానీ రిక్వెస్ట్?

did nita ambani requested rohit sharma to stay in mi

Rohit Sharma: ముంబై ఇండియ‌న్స్ య‌జ‌మాని నీతా అంబానీ.. మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌ను ఓ రిక్వెస్ట్ చేసార‌ట‌. ఈసారి ఐపీఎల్ సీజ‌న్‌లో ఓట‌మి పాలై ఎగ్జిట్ అయిన తొలి టీం ముంబై ఇండియ‌న్స్. 2023 వ‌ర‌కు కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శ‌ర్మ త‌న కెప్టెన్సీ ప్ర‌ణాళిక‌ల‌తో ఐదు సార్లు ట్రోఫీ గెలిచేలా చేసారు. ఈసారి మాత్రం ముంబై ఇండియ‌న్స్ యాజ‌మాన్యం రోహిత్ శ‌ర్మ‌ను ప‌క్క‌న పెట్టి కెప్టెన్సీ బాధ్య‌త‌ల‌ను హార్దిక్ పాండ్య‌కు ఇచ్చింది.

దాంతో రోహిత్‌తో పాటు మొత్తం ముంబై ఇండియ‌న్స్ టీం ఎంతో బాధ‌ప‌డింది. ఆ బాధ‌తోనే టీంలోని ఎవ్వ‌రూ ఈసారి స‌రిగ్గా ప్ర‌ద‌ర్శించ‌లేక‌పోయార‌ని టాక్. అయితే ఇటీవ‌ల రోహిత్ శ‌ర్మ‌ను నీతా అంబానీ క‌లిసారు. టీ20 వ‌రల్డ్ క‌ప్ ద‌గ్గ‌ర‌ప‌డుతున్న స‌మ‌యంలో రోహిత్‌కు ఆల్ ది బెస్ట్ చెప్తూ.. ప్లీజ్ రోహిత్ ముంబై ఇండియ‌న్స్‌లోనే ఉండు అని రిక్వెస్ట్ చేసార‌ట‌. ఆ స‌మ‌యంలో తీసిన వీడియో ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. వ‌చ్చే ఏడాది ఐపీఎల్ నాటికి రోహిత్ క‌చ్చితంగా ముంబై ఇండియ‌న్స్ టీంలో మాత్రం ఉండ‌డు అనే టాక్ బ‌లంగా వినిపిస్తున్న నేప‌థ్యంలో నీతా అంబానీ రోహిత్‌ను రిక్వెస్ట్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.