Astrology: 2024లో ఈ రాశుల‌కు అదృష్టం ప‌ట్ట‌బోతోంది..!

Astrology: 2024లో అఖండ రాజ‌యోగం ప‌ట్ట‌బోతున్న రాశులేంటో తెలుసుకుందాం. 2024లో ద్వాద‌శ రాశుల‌లో ఐదు రాశుల వారికి అఖండ రాజ‌యోగం ప‌ట్ట‌బోతోంది. ఎప్పుడైనా స‌రే.. న‌వ‌గ్ర‌హాల‌లో ఒక్క గురు గ్ర‌మం బ‌లం ఉన్న‌ట్లైతే తిరుగులేని విజ‌యాల‌ను సిద్ధింపజేసుకోవచ్చ‌ని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పారు. దాదాపు 80% జాత‌క దోషాల‌ను పోగొట్టే శ‌క్తి గురుగ్ర‌హానికి ఉంది.

2024 గురువు మే 1 నుంచి మేష రాశి నుంచి వృష‌భ రాశిలోకి ప్ర‌వేశిస్తున్నాడు. ఈ గురు సంచారంలో మార్పు వ‌ల్ల 2024లో ఐదు రాశుల వారికి అఖండ రాజ‌యోగం ప‌ట్ట‌బోతోంది. ఆ రాశులు ఏవంటే..

మేష రాశి

మేష రాశి నుంచి చూసుకున్న‌ప్పుడు గురువు మారిన వృష‌భ రాశి రెండో రాశి అవుతుంది. అంటే.. మేష రాశి వారికి ద్వితీయంలో గురు సంచారం ఉంది. ద్వితీయం అంటే కుటంబ స్థానం. 2024లో మేష రాశి వారికి కుటుంబం జీవితం బాగుంటుంది. ధ‌న ప‌రంగా బాగా క‌లిసొస్తుంది. ఆర్ధికంగా మంచి ఎదుగుద‌ల ఉంటుంది. మీ మాట‌కు విలువ గౌర‌వం పెరుగుతాయి. కాబ‌ట్టి వాక్కు ప‌రంగా, ధ‌న ప‌రంగా, కుటుంబ ప‌రంగా ఈ రాశి వారికి అన్నీ క‌లిసి వ‌స్తాయి.

మ‌క‌ర రాశి

మ‌క‌ర రాశి నుంచి లెక్క పెట్టిన‌ప్పుడు గురువు సంచారం మారిన వృష‌భ రాశి ఐదో రాశి అవుతుంది. అంటే మ‌క‌ర రాశి వారికి గురువు పంచ‌మ సంచారం చేస్తున్న‌ట్లు. ఈ పంచ‌మ సంచారం వ‌ల్ల మ‌క‌ర రాశి వారికి సంతానానికి సంబంధించిన వ్య‌వ‌హారాల్లో మంచి అనుకూల ఫ‌లితాలు క‌లుగుతాయి. సంతానం లేని మ‌క‌ర రాశి వారికి 2024లో క‌చ్చితంగా పిల్ల‌లు పుడ‌తారు. అలాగే… సంతానం గురించి ఆందోళ‌న చెందుతున్న‌వారికి వారి పిల్ల‌ల వ‌ల్ల మంచి పేరు ప్ర‌తిష్ఠ‌లు వ‌స్తాయి. (Astrology)

ALSO READ: Horoscope Today: ఈ రాశివారు ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త‌గా ఉండాలి

వృశ్చిక రాశి

ఈ రాశి వారికి ఈ గురువు సంచారంలో మార్పు స‌ప్త‌మ సంచారం అవుతుంది. ఈ స‌ప్త‌మ సంచారం వ‌ల్ల వృశ్చిక రాశి వారికి 2024లో క‌చ్చితంగా పెళ్లిళ్లు అవుతాయి. చాలా కాలంగా పెళ్లిళ్లు అవ్వ‌క సంబంధాలు కుద‌ర‌క ఇబ్బంది ప‌డుతున్న‌వారికి 2024లో క‌చ్చితంగా మ‌న‌సుకు న‌చ్చిన వ్య‌క్తితో పెళ్లిళ్లు అవుతాయి. దంప‌తుల మ‌ధ్య గొడ‌వ‌లు కూడా తొల‌గిపోతాయి. కుటుంబ స‌మ‌స్య‌ల వ‌ల్ల దూరంగా ఉండే దంప‌తులు క‌చ్చితంగా ఈ ఏడాదిలో క‌లుస్తారు. వైవాహిక జీవితం బాగుంటుంది. వ్యాపారం చేసేవారికి కూడా క‌లిసొస్తుంది.

క‌న్యా రాశి

క‌న్యా రాశి వారికి గురువు ఈ 2024లో మే నుంచి 9వ స్థానంలో సంచారం చేస్తాడు. పూర్వ జ‌న్మ పుణ్య ఫ‌లితం అనేది కన్యా రాశి వారిపై ప‌డుతుంది. క‌న్యా రాశి వారు ప‌ట్టింద‌ల్లా బంగారం అవుతుంది. ఆర్ధికంగా క‌న్యా రాశి వారికి తిరుగు ఉండ‌దు. ధ‌న లాభం ఉంటుంది. అనారోగ్య స‌మస్య‌లు, శత్రు పీడ‌, దిష్టి తొల‌గిపోతుంది. అనుకున్న ప‌నులు అనుకున్న‌ట్లు పూర్త‌వుతాయి. తొమ్మిదో స్థానంలో గురువు సంచారం అనేది పూర్వ జ‌న్మ ఫ‌లితాన్ని క‌లిగించి రాజ‌యోగాన్ని ప్ర‌సాదిస్తుంది.

క‌ర్కాట‌క రాశి

ఈ రాశి వారికి మే 1 నుంచి గురువు 11వ స్థానంలో సంచారం చేస్తాడు. జ్యోతిష్య శాస్త్రం ప్ర‌కారం 11వ స్థానం చాలా శ‌క్తిమంత‌మైన‌ది. మ‌ట్టి ప‌ట్టుకున్నా బంగారం అవుతుంది. ఆర్ధికంగా కర్కాట‌క రాశి వారికి 2024లో తిరుగు ఉండ‌దు. ఒక్క‌సారిగా జీవితంలో ఉన్న‌త స్థాయికి ఎదిగిపోతారు. డ‌బ్బు ప‌రంగా, వృత్తి ప‌రంగా ఉన్న‌త స్థాయికి ఎదుగుతారు. ఆక‌స్మిక ధ‌న లాభం, అనారోగ్య స‌మ‌స్య‌లు తీరిపోతాయి. దిష్టి పోతుంది. కోర్టు స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవుతాయి. అనుకున్న ప‌నులు అనుకున్న‌ట్లు తీరిపోతాయి.