అందుకే జ‌గ‌న్ ష‌ర్మిళ‌కు ఆస్తి ఇవ్వ‌లేదు

YS Vimala Reddy: జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న చెల్లెలు వైఎస్ షర్మిళ‌కు ఎందుకు ఆస్తి ఇవ్వ‌లేదు అనే అంశంపై స్పందించారు వారి మేన‌త్త వైఎస్ విమ‌లా రెడ్డి. ష‌ర్మిళ‌, సునీతా రెడ్డిలు క‌లిసి క‌డ‌ప‌లో జ‌గ‌న్, వైఎస్ అవినాష్ రెడ్డిల‌పై చేస్తున్న ఆరోప‌ణ‌లు స‌బ‌బు కాద‌ని ఆమె మండిప‌డ్డారు. ఇది మంచి ప‌ద్ధ‌తి కాదు అని చెప్పినా కూడా వారు విన‌లేద‌ని.. మంచి చెప్పినందుకు త‌న‌తో మాట్లాడ‌టం మానేసారని అన్నారు.

జ‌గ‌న్ ష‌ర్మిళ‌కు ఆస్తి ఇవ్వ‌నందుకే ఇంత క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని.. జ‌గ‌న్ ఆస్తి ఇవ్వ‌క‌పోవ‌డానికి వెనుక ఓ కార‌ణం ఉంద‌ని అన్నారు. ఆస్తుల‌న్నీ ఈడీ జ‌ప్తులో ఉన్నాయి కాబ‌ట్టే వాటా ఇవ్వ‌లేక‌పోతున్నాన‌ని.. ఆ ఆస్తులు రిలీజ్ అయితే అప్పుడు త‌ప్ప‌కుండా ఇస్తాన‌ని జ‌గ‌న్ మాటిచ్చినా ష‌ర్మిళ ఇలా ఎందుకు ప్ర‌వ‌ర్తిస్తోందో అర్థంకావ‌డంలేద‌ని తెలిపారు.

ఎవ‌రు ఏ ప‌దువులు, ఎంత డ‌బ్బు ఇస్తామ‌న్నారో కానీ.. త‌న అన్న రాజ‌శేఖ‌ర్ రెడ్డి బ‌తికున్న‌ప్పుడు క‌ష్ట‌పెట్టి ఏడిపించిన‌వారంతా ఇప్పుడు ష‌ర్మిళ చుట్టూ చేరారని.. ఇప్పుడు వారు నాశ‌న‌మైపోయేలా ఉన్నార‌ని ఆరోపించారు. ఇప్ప‌టికైనా అక్క చెల్లెళ్లు తాము చేస్తున్న‌ది ఎంత పెద్ద త‌ప్పో తెలుసుకుని అన్న‌కు సాయంగా నిలిస్తే మంచిద‌ని హెచ్చ‌రించారు.