YS Sunitha Reddy: ప‌గ తీర్చుకోవాలంటే నేనే న‌రికేదాన్ని

YS Sunitha Reddy: తన తండ్రి వైఎస్ వివేకానంద రెడ్డి (YS Viveka Murder Case) హ‌త్య కేసులో త‌న‌కు కావాల్సిన ప‌గ తీర్చుకోవ‌డం కాద‌ని.. త‌న తండ్రికి చావుకు న్యాయం జ‌ర‌గాల‌ని అన్నారు వైఎస్ సునీతా రెడ్డి. వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్య ఎందుకు ఎలా జ‌రిగింది అని వివ‌రిస్తూ మీడియా వ‌ర్గాలకు ఆమె ప్ర‌జెంటేష‌న్ ఇచ్చి చూపించారు. ఆ త‌ర్వాత మీడియా వేసిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పారు.

“” మీ తండ్రి హ‌త్య నేప‌థ్యంలో చంపిన‌వారిపై ప‌గ తీర్చుకోవాలంటే మీరే క‌డ‌ప ఎంపీ బ‌రిలో దిగ‌చ్చు క‌దా.. ఎందుకు వైఎస్ ష‌ర్మిళ మెడ‌పై తుపాకీ పెట్టి అవినాష్ రెడ్డిపై ప‌గ తీర్చుకోవాల‌ని అనుకుంటున్నారు “” అన్న ప్ర‌శ్న‌కు సునీత ఇలా బ‌దులిచ్చారు. “” నాకు కావాల్సింది ప‌గ తీర్చుకోవ‌డం కాదు. నేను కూడా సీమ బిడ్డ‌నే. నాకూ కోపం, పౌరుషం ఉంటాయి. నాకే ప‌గ తీర్చుకోవాల‌ని ఉంటే నేనే న‌రికేసేదాన్ని క‌దా. కానీ నాకు ఈ న్యాయ వ్య‌వ‌స్థ‌లో మార్పు కావాలి. ఆ మారిన వ్య‌వ‌స్థ నుంచే నాకు న్యాయం జ‌ర‌గాలి “” అని తెలిపారు.