Revanth Reddy: ఉప్ప‌ల్ మ్యాచ్‌లో సీఎం వెన‌కే డ్ర‌గ్స్ కేసు నిందితుడు

Revanth Reddy: నిన్న ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఉప్పల్ స్టేడియంలో జరిగిన క్రికెట్ మ్యాచ్ చూడటానికి తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి త‌న కుటుంబంతో స‌హా వెళ్లారు. ఆయ‌న‌తో పాటు కాంగ్రెస్ నాయకులు పట్నం సునీత మహేందర్ రెడ్డి, ఏపీ జితేందర్ రెడ్డి వెళ్ళగా.. అక్క‌డే వెనుక వ‌రుస‌లో పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసు నిందితుడు అభిషేక్ ఉప్పాల వారితో కలిసి మ్యాచ్ వీక్షించాడు. 2022లో జరిగిన ఈ డ్రగ్స్ కేసులో చాలా మంది సినిమా సెలెబ్రిటీలతో సహా రేవంత్ రెడ్డి అల్లుడు, సూదిని జైపాల్ రెడ్డి మనవడు సూదిని ప్రణయ్ రెడ్డి సైతం పట్టుబడిన విషయం తెలిసిందే.